మహబూబ్ నగర్ అర్బన్: విపక్ష పార్టీల నాయకులు అవగాహన లేకుండా కార్పొరేషన్ల పారదర్శకంగా విభజన జరిగిందని: డిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి వినోద్
విపక్ష పార్టీల నాయకులు ఏమాత్రం అవగాహన లేకుండా కార్పొరేషన్ల విభజన గురించి మాట్లాడుతున్నారని డిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ విమర్శించారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ లో విభజన పారదర్శకంగా జరిగిందని వెల్లడించారు. విపక్ష పార్టీలు గత పాలకులు చేసిన తప్పులను తప్పిపుచ్చుకునేందుకు తమపై నిందలను మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు