తాడిపత్రి లోని అతి పురాతనమైన శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు అయిన గురువారం వసంతోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు త్రిశూల స్నానం ఆచరించారు. హోమాలు, పూర్ణాహుతి వంటి పూజలు చేశారు. స్వామివారి ఉత్సవమూర్తులను తలపై పెట్టుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మొత్తం పై అత్యంత భక్తిశ్రద్ధలతో వసంతోత్సవాన్ని నిర్వహించారు.