సంతనూతలపాడు: గోనుగుంట లో వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి కార్యక్రమం
చీమకుర్తి మండలంలోని గోనుగుంట గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో గురువారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి కలశార్చన, సాలిగ్రామార్చన, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి , భక్తులకు దర్శనానికి అనుమతించారు.