కనిగిరి: చంద్రశేఖరపురం లోని శ్రీ చంద్రమౌలేశ్వర స్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాల చోరీ సీసీ కెమెరా ఫుటేజ్ విడుదల చేసిన పోలీసులు
చంద్రశేఖరపురంలో శ్రీ చంద్రమౌలేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి దొంగలు పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లిన సంఘటన తెలిసిందే. ఈ చోరీ ఘటనపై పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా ఆలయంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు ఆ ఫుటేజ్ మీడియాకు గురువారం విడుదల చేశారు. దొంగలు ఆలయంలోకి ముసుగులు ధరించి పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా పోలీసులకు లభ్యమయింది.