ఉరవకొండ: బెలుగుప్పలోని వ్యవసాయ సహకార సంఘంలో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం లో రైతులకు APAIMS పద్ధతి గురువారం యూరియా పంపిణీ చేపట్టడం జరిగిందని ఏవో పృథ్వి సాగర్ పేర్కొన్నారు. సహకార సంఘం చైర్మన్ కెంచి రాముడు డైరెక్టర్లు ఈశ్వర్ ,లక్ష్మీబాయి, టిడిపి నాయకులు మల్లికార్జున వారి ఆధ్వర్యంలో రైతులకు యూరియాను పంపిణీ చేయడం జరిగినది. ఏ ఓ, చైర్మన్ లు మాట్లాడుతూ ప్రభుత్వము రైతులకు అవసరమైన యూరియా డిఎపి,ఇతర ఎరువులను సహకార సంఘం ద్వార వేసిన పంటకు అవసరమైన ఎరువులను APAIMS పద్ధతి ద్వారా పంపిణీ చేపట్టడం జరిగిందని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సీఈఓ పాండు, నాయకులు పాల్గొన్నారు.