పామూరు పట్టణంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ మరియు విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. శివాజీ మహారాజ్ చిత్రపటానికి నివాళులు అర్పించి, ప్రత్యేకమైన వాహనంలో శివాజీ మహారాజ్ చిత్రపటాన్ని ఉంచి పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. శివాజీ మహారాజ్ భారతదేశానికి చేసిన సేవలను వివరిస్తూ ఈ ర్యాలీ కార్యక్రమం కొనసాగించారు.