రాప్తాడు: నవయుగ కాలనీలో నీటి సమస్య పరిష్కరించాలని అనంతపురం ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపిన సిపిఐ నేతలు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని నవయుగ కాలనీలో నీటి సమస్యను పరిష్కరించాలని సోమవారం 1140 నిమిషాల సమయంలో రూరల్ ఎంపీడీవో కార్యాలయం వద్ద నవయుగ కాలనీ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నగర కార్యదర్శి శ్రీరాములు , రాజు తదితరులు మాట్లాడుతూ నవయుగ కాలనీలో నీటి సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత అధికారుల దృష్టికి తీసుకుపోయిన నీటి సమస్య పరిష్కరించలేదని అందుకే ఆందోళన చేపడుతున్నామని పది రోజుల్లోగా ఈ సమస్య పరిష్కరించాలని లేకుంటే ఆందోళన చేపడతామని సిపిఐ శ్రీరాములు రాజు డిమాండ్ చేశారు.