ఉరవకొండ: గంజికుంట గ్రామం వద్ద అరటి తోటకు నిప్పు రైతుకు తీవ్ర నష్టం
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం గంజికుంట గ్రామానికి చెందిన రైతు ఆవుల వెంకట్రాముడుకు చెందిన నాలుగ ఎకరాల అరటి తోటకు శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం వల్ల అగ్ని ప్రమాదానికి గురైంది. అగ్ని ప్రమాదంలో డ్రిప్పు పరికరాలు, పైపులు, మోటారు వైరు కాలిపోయాయి . నాలుగు ఎకరాల గల అరటి తోట మంటల్లో కాలిపోవడంతో పెట్టుబడులు దిగుబడులు నష్టపోయి లక్షల్లో నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని రైతు ఆవేదన వ్యక్తం చేసాడు. ఉరవకొండ అగ్నిమాపక వాహనం చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసినా అప్పటికే జరగాల్సింది నష్టం జరిగిందని రైతు వాపోయాడు.