గిద్దలూరు: కొమరోలు మండలం అక్కపల్లె సమీపంలో జంట ఆత్మహత్య ఘటనపై మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించిన ఎస్ఐ నాగరాజు
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అక్కపల్లె సమీపంలో ఓ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం వెలుగు చూసింది. స్థానిక ఎస్సై నాగరాజు జరిగిన సంఘటనపై విచారణ చేపట్టారు. మృతులు నంద్యాల జిల్లాకు చెందినవారుగా తెలిపారు. డయల్ 100 వచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టినట్లు తెలిపారు. పోస్టుమార్టం కొరకు మృతదేహాలను గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నట్లు ఎస్ఐ అన్నారు. ఆత్మహత్యఘటనపై పూర్తి వివరాలను ఆదివారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ఎస్ఐ నాగరాజు మీడియాకు తెలిపారు.