అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల కేంద్రంలో కేజీబీవీ కళాశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలికల రక్షణ, విద్య మరియు బాలికల చట్టపరమైన అవగాహన పెంఫు కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ నాగరత్న బాయ్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిళా శిశు సంక్షేమ శాఖ మిషన్ కోఆర్డినేటర్ శ్రీదేవి చైల్డ్ హెల్ప్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ కృష్ణమాచార్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా బాలికల చట్టాలు రక్షణ వ్యవస్థ హక్కుల చైతన్యం, సైబర్ క్రైమ్ ఆన్లైన్ గేమ్ అంశాలపై అవగాహన కల్పించారు.