చీమకుర్తి: దిత్వా తుఫాన్ ప్రభావం వల్ల కురిసే వర్షాల పట్ల చీమకుర్తి మండలం లోని రైతులు అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ బ్రహ్మయ్య సోమవారం సూచించారు. వరి పంట సాగు చేసిన రైతులు తుఫాను ప్రభావం వల్ల కురుస్తున్న వర్షాలకు పంట దెబ్బతినే అవకాశం ఉందన్నారు. వరి పంటను వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు కొయ్యవద్దని రైతులకు సూచించారు. పంట నష్టం జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు.