కనిగిరి: ఉపాధి హామీ పథకంలో అవకతవకలు అరికట్టేందుకు కూలీల అకౌంట్లలోకే నేరుగా నగదు జమ: బిజెపి జిల్లా నాయకులు వెంకటరమణయ్య
పామూరు: బడుగు, బలహీన వర్గాలకు ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధి చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బిజెపి జిల్లా నాయకులు కొండిశెట్టి వెంకట రమణయ్య అన్నారు. పామూరులో ఉపాధి కూలీలతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు..కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఉపాధి హామీ పథకంలో అవకతవకలను అరికట్టేందుకు, పథకం పేరును మార్చి, నేరుగా కూలీల అకౌంట్లోకి ప్రభుత్వం నగదును జమ చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఉపాధి కూలీలు. బిజెపి నాయకులు పాల్గొన్నారు.