మార్కాపురం: డిసెంబర్ 8వ తేదీ వరకు పులుల లెక్కింపు జరుగుతుందని ఫారెస్ట్ రేంజర్ పిచ్చిరెడ్డి వెల్లడి
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మార్కాపురం మండలాల్లోని అడవి ప్రాంతాలలో పులుల లెక్కింపు ప్రారంభమైందని ఫారెస్ట్ రేంజర్ పిచ్చిరెడ్డి తెలిపారు. మార్కాపురం గిద్దలూరు నంద్యాల ఆత్మకూరు డివిజన్ పరిధిలోని 25 రేంజిలలో అధికారులు, బేస్ క్యాంప్ సిబ్బంది, ప్రొటెక్షన్ వాచర్స్ కలిపి 500 మంది పులుల గణనాల్లో నిమగ్నమయ్యారన్నారు. డిసెంబర్ 8 వరకు జరుగు గణనలో పాదముద్రలు మలము ద్వారా సైంటిఫిక్ పద్ధతిలో లెక్కింపు జరుగుతుందన్నారు.