మార్కాపురం జిల్లా కేంద్రంలో వెలిసిన జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా ఇవాళ రథోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పురవీధులలో భక్తుల శివనామస్మరణతో రథోత్సవం నిర్వహించారు.