మార్కాపురం జిల్లా తర్లపాడు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదని స్థానిక ప్రజలు అన్నారు. ఉద్యోగులు సిబ్బంది ఎప్పుడు వస్తారో తెలియదు ఎప్పుడు వెళ్తారో తెలియదు అని అన్నారు. తమ పని అవసరాల కోసం కార్యాలయ చుట్టూ తిరుగుతున్నామని అన్నారు. వారికోసం ప్రతిరోజు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.