మార్కాపురం జిల్లా కేంద్రంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన కార్యక్రమానికి సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సహకార సంఘం ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 36 అమలు పరచాలన్నారు.