ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో బైక్ దొంగలు హల్ చల్ చేశారు. గుంటూరు కర్నూలు హైవే పై ఉన్న మేడేపిలో ముత్తలూరి బ్రహ్మమనే సచివాలయ ఉద్యోగి బైకు చోరీకి గురైంది. మరో రెండు బైకులు తాళాలు రాకపోవడంతో అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. టీమ్ గా వచ్చిన దొంగలు బైకులను దర్జాగా చోరీ చేస్తుండడంతో స్థానికులు భయపడుతున్నారు. వారు చేసిన దొంగతనాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.