గిద్దలూరు: రాచర్ల నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి మృతి పై విచారణ వేగవంతం చేసి అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు
మార్కాపురం జిల్లా రాచర్ల నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. పులి అనుమానస్పద మృతి చెందడంతో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. పులి చనిపోయిందని సమాచారం ఇచ్చిన వ్యక్తి అదృశ్యం కావడంతో ఆ వ్యక్తిని అధికారులు గుంటూరులో అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పులి కాలు గోర్లు అమ్మేందుకే ఆ వ్యక్తి గుంటూరుకు వెళ్ళినట్లుగా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతుందని అధికారులు వెల్లడించారు. డిప్యూటీ సీఎం ఈ ఘటనపై సీరియస్ అయిన విషయం అందరికీ తెలిసిందే.