రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నెల్లూరుకు బయలుదేరుతున్న సమయంలో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గూడూరు జాతీయ రహదారిపై లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన నెల్లూరుకు పయనం అయ్యారు.