మార్కాపురం జిల్లా కంభం పట్టణంలో చత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జయప్రకాష్ వీధి నుంచి కందులాపురం సెంటర్ వరకు ఈ శోభాయాత్ర జరిగింది. ఈ సందర్భంగా ఆర్య మరాఠా సంఘం సభ్యులతో పాటు పలువురు భారీ ర్యాలీ నిర్వహించి చత్రపతి శివాజీకి నివాళులు అర్పించారు. చత్రపతి శివాజీ వీర గాధను ప్రజలకు వినిపించారు. కార్యక్రమంలో భాగంగా ఎటువంటి అల్లర్లు ఆవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా స్థానిక ఎస్సై శివకృష్ణారెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు.