ఉరవకొండ: జల్లిపల్లి గ్రామంలో కలకలం రేపిన మారెమ్మ దేవాలయంలో చోరీ ఘటన
అనంతపురం జిల్లా కూడేరు మండలం జల్లిపల్లి గ్రామంలో ఉన్న మారెమ్మ దేవాలయంలో చోరీ ఘటన ఆదివారం కలకలం రేపింది. ఆలయంలోకి చొరబడిన దొంగలు 3 తులాల బంగారం, 4 కేజీల వెండి ఆభరణాలను అపహరించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలోని కూడలి వద్ద చోరీ ఘటన చోటు చేసుకోవడంతో గ్రామ ప్రజలు విస్తు పోయారు. మారెమ్మ దేవత అమ్మవారి ఆలయంలో చోరీ ఘటనపై స్థానికులతో కలిసి పోలీసులకు సమాచారం అందించారు.