ఉరవకొండ: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గురించి పంచాయితీ కార్యదర్శులకు డిజిటల్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమాలు
అనంతపురం జిల్లా కూడేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు బుధవారం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ గురించి పంచాయతీ కార్యదర్శులకు మరియు డిజిటల్ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణకు సంబంధించి ఉరవకొండ నుండి రిసోర్స్ పర్సన్ రహీమ్ ద్వారా వ్యవసాయ శాఖలో సిబ్బంది పనితీరులో మార్పు, వేగవంతం, సామర్థ్యం పెంపు, స్మార్ట్ నిర్ణయాలు, నివేదికల తయారీ తదితర అంశాలపై ఇందులో పాల్గొన్నవారికి వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొనడం జరిగింది.