రాప్తాడు: రాష్ట్రంలో మహాత్మా గాంధీజీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కొనసాగించాలి సమత గ్రామంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని సమతా గ్రామం వద్ద శుక్రవారం 11:30 గంటల సమయంలో సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తదితరులు ముఖ్యఅతిథిగా హాజరై సిపిఐ పార్టీ నేతలతో కలిసి మూడు రోజుల పాదయాత్రను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం మహాత్మా గాంధీజీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసి విబిజి రాంజీ పథకాన్ని పేరు తొలగించి గాంధీజీ పేరుతోనే పథకాన్ని కొనసాగించి 100% కేంద్రం నిధులు ఇవ్వాలని లేకుంటే పోరాటాలు చేస్తామని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు.