ఉరవకొండ: దోమలపై యుద్ధానికి సిద్ధం చేస్తూ ఉరవకొండ డివిజన్లోని అన్ని గ్రామాలలో ఊరువాడ మలేరియా డెంగీ నివారణ ర్యాలీలతో అవగాహన
దోమలపై యుద్ధానికి సిద్ధం చేస్తూ అనంతపురం జిల్లా ఉరవకొండ డివిజన్లోని అన్ని గ్రామాలలో ఊరువాడ మలేరియా డెంగీ నివారణ ర్యాలీలు మరియు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి శనివారం నాడు తెలియజేశారు ప్రజల భాగస్వామ్యంతో దోమల నివారణ సాధ్యపడుతుందని జూన్ నుంచి అక్టోబర్ వరకు వర్షాకాలం ఉంటుందని యాంటీ మలేరియా యాంటీ డెంగ్యూ పై డిసెంబర్ వరకు వివిధ స్థాయిలలో తాము కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు వర్షాకాలం ప్రారంభం కావడంతో జూన్ నెల 30 తారీఖు వరకు మలేరియా వ్యతిరేక మాస ఉత్సవాల ర్యాలీలు అవగాహన సమావేశాలను నిర్వహిస్తున్నామన్నారు.