కనిగిరి: పామూరు మండలంలోని కొత్తపల్లిలో వైభవంగా శ్రీ సీతారాముల మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం, భారీగా తరలివచ్చిన భక్తులు
పామూరు మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నిర్మించిన శ్రీ సీతారాముల ఆలయంలో గురువారం ఆలయ కమిటీ నిర్వాహకులు వేద పండితుల ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం తో పాటు ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. భారీ క్రేన్ సహాయంతో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయగా కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులు జైశ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని హోరెత్తించారు. భక్తులకు పండితులు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.