ఉరవకొండ: దోమల నివారణ పై ర్యాలీలతో అవగాహన కల్పించిన మండల అధికారులు
మలేరియా వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడాలని అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల తహసిల్దార్ జయశ్రీ, డిప్యూటీ తహసిల్దార్ నరేష్ కుమార్, మండల వైద్యాధికారి డాక్టర్ తేజస్వి మంగళవారం పేర్కొన్నారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి ఆధ్వర్యంలో మలేరియా వ్యతిరేక మాసోత్సవం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు వారు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర నుండి స్థానిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి మలేరియా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు.