ఉరవకొండ: ఎల్-నినో పరిస్థితుల్లో పశుగ్రాస నిర్వహణ, పశువుల పోషణపై రైతులకు అవగాహన కార్యక్రమం
ఎల్-నినో పరిస్థితుల్లో పశుగ్రాస నిర్వహణ, పశువుల పోషణపై రైతులకు అవగాహన కల్పించేందుకు అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని అంకంపల్లి గ్రామంలో పశుగ్రాస వారోత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో, ఆత్మ (ATMA) సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పశుపోషకులు, పాల ఉత్పత్తిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం రాధిక అధ్యక్షత వహించారు కళ్యాందుర్గ ఏరియా వెటర్నరీ ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎల్-నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు.