కనిగిరి: చంద్రశేఖరపురం మండలం కంభంపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, వ్యక్తికి తీవ్ర గాయాలు
చంద్రశేఖరపురం మండలంలోని కంభంపాడు జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పాస్టర్ పందిటి ఏసుకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ పాస్టర్ యేసును స్థానికులు 108 అంబులెన్స్ లో పామూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు చికిత్సను అందించి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించారు.