ఉరవకొండ: జీడిపల్లి రిజర్వాయర్ లో సరదాగా ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్ లో సరదాగా ఈతకు దిగిన విజయ్(12) లోతు ఎక్కువ ఉన్న ప్రాంతంలో నీకమునిగి మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. జీడిపల్లి గ్రామానికి చెందిన హరిజన వెంకటేశులు అనంతపురంలో ఒక అపార్ట్మెంట్ భవనానికి సంబంధించి వాచ్మెన్ గా ఉద్యోగం చేస్తున్నారు .ఇతని కొడుకు హరిజన విజయ్(12) ఏడవ తరగతి అనంతపురంలోనే చదువుతున్నారు. ఎండాకాలం సెలవులు కావడంతోఅక్కడ తన ముగ్గురు స్నేహితులను మరియు ఒక మహిళ ఆమె కూతురు కలిసి జీడిపల్లి డ్యాం చూసిరావడానికి వచ్చిన విజయ్ సరదాగా ఈతకు వెళ్లి లోతు ఎక్కువ ఉన్నచోటికి వెళ్లడంతో నీటి మునిగిపోయాడు. మిగిలిన మిత్రులు