కనిగిరి: ఏబీఎన్ ఛానల్ ఎండి రాధాకృష్ణ పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కనిగిరి వైసీపీ ఇన్చార్జి నారాయణ యాదవ్
కనిగిరి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల భార్యలపై ఏబీఎన్ ఛానల్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ ఛానల్ ఎండి వేమూరి రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కనిగిరి పోలీస్ స్టేషన్లో వైసిపి నాయకులతో కలిసి ఆయన గురువారం ఫిర్యాదు చేశారు. రాజధాని విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచించిన మావిగన్ కు ప్రజల్లో ఆదరణ వస్తున్న నేపథ్యంలో అది చూసి ఓర్చుకోలేని రాధాకృష్ణ వైసిపి నాయకుల భార్యలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు.