ఉరవకొండ: విడపనకల్లు వద్ద పిడుగు పడి 26 గొర్రెలు, మేకలు మృతి, అస్వస్థతకు గురైన గొర్రెల కాపరి మల్లికార్జున
అనంతపురం జిల్లా విడపనకల్లు మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం పిడుగు పడి గొర్రెల కాపరి మల్లికార్జునకు చెందిన 26 గొర్రెలు, మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనలో మల్లికార్జున అస్వస్థతకు గురవ్వడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చిరుజల్లులు కురిసిన సమయంలోనే పిడుగు పడిందని స్థానికులు తెలిపారు.