ఉరవకొండ: గంగవరం గ్రామం వద్ద రీ సర్వే మరియు పవర్ గ్రిడ్ ఏర్పాటు ప్రక్రియను పరిశీలించిన ఆర్డీవో వసంత బాబు
అనంతపురం జిల్లా గంగవరం గ్రామంలో గ్రామ రెవెన్యూ కార్యాలయంను కళ్యాణదుర్గం ఆర్డీవో వసంత బాబు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు.అనంతరం గంగవరం గ్రామంలో గతంలో రీసెర్వే చేయడం జరిగిందని, రైతులకు జాయింట్ ఎల్ పి ఎం ఉన్న రైతులకు అవగాహన కల్పించి, వారికి పాస్ పుస్తకాలు వచ్చే విధంగా, అలాగే రీసర్వ్ చేసిన భూముల రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందించే విధంగా, ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలని సిబ్బందికి ఆర్ డి ఓ సూచించారు. జూన్ నెలలో పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు అలాగే గంగవరం గ్రామంలో పవర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసం దాదాపు 170 ఎకరాలు అవసరం ఉంటుందని, ఆర్డిఓ పేర్కొన్నారు.