రాప్తాడు: భైరవ నగర్ కె ఎస్ ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ సత్య లత ఆధ్వర్యంలో శ్రీ శక్తి అవగాహన సదస్సు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని భైరవ నగర్ లో కె ఎస్ ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో శ్రీ శక్తి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ సత్యలత మాట్లాడుతూ డిగ్రీ మహిళా కళాశాలలో శ్రీ శక్తి అవగాహన సదస్సు నిర్వహించి విద్యార్థినిలకు మహిళలు భద్రత ఆరోగ్యం విద్యా ప్రాధాన్యత చట్టపరమైన హక్కుల పైన అవగాహన కల్పించడం జరిగిందని ప్రిన్సిపల్ డాక్టర్ సత్యలత పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో పరివిన్ లక్ష్మీ రంగయ్య బండి సునీత తదితరులంతా పాల్గొన్నారు.