రాప్తాడు: రాప్తాడు నియోజకవర్గంలో ప్రజలు సమస్యలు పరిష్కరించేందుకు ఎప్పుడు కృషి చేస్తా అనంతపురంలో ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయం నందు బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు రాప్తాడు నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుంచి మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి సమస్యలను అర్జీ రూపంలో తీసుకొని వారి సమస్యలు అనేటివి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గం లో వివిధ కారణాలతో సమస్యలపై వచ్చిన ప్రజలు కార్యకర్తలు సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని వాటిని అన్నిటినీ పరిష్కరించేందుకు ఎప్పుడు కృషి చేస్తానన్నారు అదేవిధంగా వివిధ శాఖ అధికారులు కూడా కలవడం జరిగిందని పరిటాల సునీత పేర్కొన్నారు.