కనిగిరి: మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా పనిచేస్తున్నాం: కనిగిరి మున్సిపల్ కమిషనర్ శ్రీధర్
కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని 4 మరియు 16 వార్డులలో మున్సిపల్ కమిషనర్ పీ శ్రీధర్ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ చేపడుతున్న డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ల ను కమిషనర్ ఆదేశించారు. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో కనిగిరి మున్సిపాలిటీలో డ్రైనేజీ కాలువలు లేనిచోట్ల వాటి నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కనిగిరి మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. కార్యక్రమంలో టిడిపి అధ్యక్షులు ఫిరోజ్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.