గుత్తి శివారులోని పెద్దవడుగూరు మండల పరిధిలో ఉన్న గేట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం హానర్ అవార్డుల ప్రధాన కార్యక్రమం జరిగింది. ఎంబీఏ, ఎంసీఏ, డిప్లొమా కోర్సులలో అకాడమిక్ లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు హానర్ అవార్డులను ప్రధానం చేశారు. గేట్స్ కరస్పాండెంట్ పద్మావతమ్మ, ఎండీ రఘునాథ్ రెడ్డి, డైరెక్టర్ వాణి, ప్రిన్సిపాల్ డాక్టర్ నమ్రత విద్యార్థులకు హానర్ అవార్డులను ప్రధానం చేశారు. తల్లిదండ్రుల సమక్షంలో హానర్ అవార్డులను అందుకోవడంతో విద్యార్థులు సంతోషించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రతిభను చూసి మురిసిపోయారు, గర్వపడ్డారు.