ఉరవకొండ: పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద ఆదివారం ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ పేరుతో ఆర్టీసీ సంస్థను దశల వారీగా ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని యూనియన్ నాయకులు ఆరోపించారు. విలువైన ఆర్టీసీ సంస్థ ఆస్తులను ప్రైవేట్ ఆపరేటర్లకు కట్టబెట్టే ప్రయత్నాలను తక్షణమే నిలిపివేయాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. *మీ సాక్షి టీవీ లో...*