ఉరవకొండ: నియోజకవర్గ వ్యాప్తంగా 101 మంది లబ్ధిదారులకు రూ.36.16 లక్షల విలువచేసే సీ ఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన మంత్రి కేశవ్
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మండలాలకు చెందిన లబ్ధిదారులకు పెద్ద కౌకుంట్ల గ్రామంలోని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ క్యాంపు కార్యాలయంలో సోమవారం 101 మంది లబ్ధిదారులకు రూ. 36.16 లక్షల విలువచేసే చెక్కులను మంత్రివర్యులు పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న పేద ప్రజలకు వైద్య చికిత్సలు అత్యవసరాల సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైన వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయం అందించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. తమకు కష్ట సమయంలో సహాయం అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కు , మంత్రి పయ్యావుల కేశవ్ కు లబ్ధిదారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.