సంతనూతలపాడు: సంతనూతలపాడు మండలం మంగమూరులో అశోక్ అనే వ్యక్తి హత్య, హతుడి భార్య ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు
సంతనూతలపాడు మండలం మంగమూరుకు చెందిన పిల్లి అశోక్ అనే వ్యక్తిని పాత గొడవల నేపథ్యంలో కొందరు ఆదివారం రాత్రి పొడిచి చంపారు. మృతుడు భార్య దేవరపల్లి వినీల హత్యకు పాల్పడిన నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సోమవారం సీఐ శేషగిరిరావు, ఎస్సై అజయ్ బాబు హత్య ఘటనపై విచారణ చేపట్టారు. అక్రమ సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. హత్య ఘటన జరిగిన నేపథ్యంలో గ్రామంలో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.