ఉరవకొండ: గ్రామాల్లో మలేరియా వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమాలు
మలేరియా నిర్మూలనకు అందరి సహకారం అవసరమని ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి పేర్కొన్నారు మంగళవారం అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం, పాల్తూరు గ్రామాలలో పెద్ద ఎత్తున అవగాహన సమావేశాలను నిర్వహించారు. మలేరియా వ్యతిరేక మాస ఉత్సవంలో వైద్యాధికారులు మస్రత్ జహ, శివశంకర్ నాయక్ లు గ్రామాల్లో ప్రజలకు చైతన్యం కలిగించి దోమల వ్యాప్తిని అరికడదాం, పరిశుభ్రత బాట,నిల్వ ఉన్న నీరు దోమలకు పుట్టినిల్లు చిన్న దోమ పెను ప్రమాదం, దోమ పుట్టరాదు దోమ కుట్టరాదనే అంశాలపై వివరించారు.