కనిగిరి: పట్టణంలో అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ పనులను పరిశీలించిన కనిగిరి మున్సిపల్ కమిషనర్ శ్రీధర్
కనిగిరి పట్టణంలో ఒంగోలు బస్టాండ్ సెంటర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటు పనులను కనిగిరి మున్సిపల్ కమిషనర్ పి శ్రీధర్ మంగళవారం పరిశీలించారు. విగ్రహావిష్కరణకు అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలను తొలగించేందుకు విద్యుత్ శాఖ అధికారులను పిలిపించి, అడ్డుగా ఉన్న విద్యుత్ తీగలను తొలగింప చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ... అంబేద్కర్ విగ్రహవిష్కరణ కార్యక్రమానికి కనిగిరి నియోజకవర్గం నుండి ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి ఆదేశాల మేరకు వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.