కనిగిరి: పట్టణంలో జనగణన కార్యక్రమంలో భాగంగా ఇండ్ల గణనను జయప్రదం చేయాలని ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ
కనిగిరి పట్టణంలో జనగణన కార్యక్రమంలో భాగంగా చేపట్టే ఇండ్ల గణనా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కనిగిరి ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం అధికారులు అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీని నిర్వహించి, శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి మాట్లాడుతూ... జన గణన కార్యక్రమంలో భాగంగా ఇండ్ల గణన కార్యక్రమం మే 1వ తేదీ నుండి జరుగుతుందన్నారు. జనగణన పై అపోహలు వద్దని, వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఇండ్ల గణనను జయప్రదం చేయాలని కోరారు.