రాప్తాడు: అనంతపురంలో రాప్తాడు నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం 11:30 నుంచి 2:30 గంటల వరకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు అనంతపురం రూరల్ ఆత్మకూరు తదితర గ్రామాలనుంచి వచ్చిన ప్రజల నుంచి సమస్యలను అర్జీ రూపంలో తీసుకోవడం జరిగింది ప్రజలు ఇచ్చిన అర్జీలు అన్ని పరిశీలించి ఆయా శాఖకు పంపించి సమస్య పరిష్కరించాలని అధికారులను కోరుతామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో అనంతపురం రూరల్ టిడిపి నేత నారాయణస్వామి టిడిపి నేతలు ప్రజలు పాల్గొన్నారు.