కనిగిరి: గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: టిడిపి రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ చౌదరి
పామూరు మండలంలోని బొట్లగూడూరు గ్రామంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్యదర్శి రాజగోపాల్ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామసభను నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర టిడిపి విభిన్న ప్రతిభావంతుల ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ... గ్రామాభివృద్ధికి అవసరమైన తీర్మానాలు పంచాయితీ గ్రామసభల ద్వారానే జరుగుతాయని , గ్రామ సభలకు ప్రజలు తప్పనిసరిగా హాజరై సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో అవినీతిని తగ్గించి, పారదర్శకతను పెంపొందించి ,స్థానిక సమస్యలను నేరుగా పరిష్కరించుకునేందుకు గ్రామసభలు దోహదం చేస్తాయని ఆయన అన్నారు.