కనిగిరి: పట్టణంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి: ప్రకాశం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ కాశిరెడ్డి
కనిగిరి: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని ప్రకాశం జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి అన్నారు. కనిగిరి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డీసీఎంఎస్ చైర్మన్ కాశిరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కనిగిరి మున్సిపాలిటీలో ప్రధాన రహదారుల్లో, ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వేసవిలో దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉందని, దాతలు ముందుకు వచ్చి చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.