కనిగిరి: పట్టణ టిడిపి మాజీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసరెడ్డి గుండెపోటుతో ఆకస్మిక మృతి
కనిగిరి పట్టణ మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తమ్మినేని శ్రీనివాసులు రెడ్డి శనివారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. తమ్మినేని శ్రీనివాసులు రెడ్డి మృతి పట్ల కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ మంచి నాయకుడిని కోల్పోయిందని, పార్టీకి శ్రీనివాసుల రెడ్డి చేసిన సేవలు మరువలేని అన్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు శ్రీనివాసుల రెడ్డి నివాసానికి చేరుకొని, ఆయన పార్థివ దేహాన్ని దర్శించుకుని నివాళులు అర్పిస్తున్నారు.