కనిగిరి: పట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పరిష్కరించుకొని యోగ పై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అధికారులు
కనిగిరి పట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా శిక్షణ కార్యక్రమాన్ని అధికారులు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు కార్యక్రమానికి హాజరైన వారిచే యోగాలో శిక్షణ ఇచ్చారు. అనంతరం కనిగిరి డివిజనల్ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ... యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఈనెల 7 నుండి 20వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఈనెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.