ఉరవకొండ: బెలుగుప్పలో కూటమి ప్రభుత్వ పాలనపై వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమం నిర్వహించిన వైయస్సార్సీపి
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని బెలుగుప్ప మండల కేంద్రంలో వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా అధికార ప్రతినిధి వీరన్న పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మచ్చెన్న, జెడ్పిటిసి మమతా త్రిలోక్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శివలింగ, రాష్ట్ర కమిటీ మెంబర్ శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ వెంకట రెడ్డి, ఎంపీటీసీలు సర్పంచులు మండల సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైయస్సార్ సర్కిల్ వద్ద వెన్నుపోటుకు రెండేళ్లు ప్రతులను దహనం చేశారు.