కనిగిరి: హనుమంతుని పాడు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి, నల్లగండ్ల లో పర్యటించిన డివిజనల్ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాస రెడ్డి
హనుమంతునిపాడు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి, నల్లగండ్ల గ్రామాల్లో కనిగిరి డివిజనల్ డెవలప్మెంట్ అధికారి శ్రీనివాస రెడ్డి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న శానిటేషన్ కార్యక్రమాలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం స్థానికులతో ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే సీజనల్ వ్యాధులు ప్రజలే అవకాశం ఉందని హెచ్చరించారు. పంచాయతీ పారిశుధ్య సిబ్బంది స్థానికుల నుండి తడి చెత్త, పొడి చెత్తను వేరుచేసి, సేకరించి చెత్త సంపద కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు.