కనిగిరి: పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు కృషి: కనిగిరి మున్సిపల్ కమిషనర్ శ్రీధర్
కనిగిరి పట్టణంలోని 4వ వార్డులో రూ.8 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులకు కనిగిరి మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. కనిగిరి పట్టణంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. అందులో భాగంగానే పట్టణంలోని 20 వార్డుల్లో సీసీ రోడ్లు , డ్రైనేజీ కాలువలు లేనిచోట్ల గుర్తించి, వాటి నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.